కమలాపురం సంతాన గోపాలాచార్యులు, ఆంధ్ర, తమిళ, మలయాళ, సంస్కృత భాషల్లో రామాయణ, భారత, భగవత్గీత పైన ఉపన్యాసాలు ఎంతో అద్భుతంగా ఇచ్చిన మహానుభావులు. ధనుర్మాసంలో తిరుప్పావై పైన వారి ఉపన్యాసానికి కనీసం ఒక వెయ్యి మంది వచ్చేవారు. వారి కుమారుడు వారి సుందరకాండ ప్రవచనాలని CD రూపంలో పొందు పరిచారు. విని తరించాల్సిన ప్రవచానాలివి. గత ఏడు రోజులు గా ఎన్ని మార్లు ఈ ప్రవచనాలని విన్నానో అంతే ఆనందాన్ని మళ్లీ మళ్లీ పొందినాను.